Politics

*రైల్వే స్టేషన్లో పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే*

నిజామాబాద్ సెప్టెంబర్ 23:(నిఘానేత్రం ప్రతినిధి) భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదినం సందర్బంగా 15 రోజుల పాటు జరిగే సేవా మహాజ్ఞాన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొనడం జరిగింది…

ఈ సందర్బంగా ఎమ్మెల్యే , దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించి, రైల్వే స్టేషన్ లో ఉన్న పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది..

అనంతరం మీడియాతో మాట్లాడుతు భారతమాత ముద్దుబిడ్డ మూడోసారి భారతదేశ ప్రధానిగా సేవాలాందిస్తున్న నరేంద్రమోదీ గారు నేడు ప్రపంచ స్థాయి నాయకునిగా ఎదగడం భారతీయులంతా గర్వించదగ్గ విషయం అని అన్నారు…

ఆ మహనీయుని జన్మదినం సందర్బంగా భారతీయ జనతా పార్టీ సేవా మహాజ్ఞానం కార్యక్రమాలు దేశమంతట నిర్వహించడం జరుగుతుందన్నారు..

ఇందూర్ జిల్లాలో మొదటి రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం, ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు…. ఈరోజు నిజామాబాద్ రైల్వే స్టేషన్ లో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

భారతదేశన్ని విశ్వగురువుగా నిలబెట్టలనే సంకల్పంతో, భారతదేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న నరేంద్రమోడీ జన్మదినానికి జిల్లా వ్యాప్తంగా సేవకార్యక్రమాలు నిర్వహించి నరేంద్రమోడీకి బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు…

నిరంతరం భారతమాతకు సేవలాందిస్తున్న ఆ మహనీయులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button