Politics

ప్రజా భవన్ లో నిర్వహించే ప్రజావాణి 11కు వాయిదా

నిజామాబాద్, నిజామాబాద్ నిఘానేత్రం ప్రతినిధి సెప్టెంబర్ 08 : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో మహాత్మ జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 11వ తేదీకి వాయిదా వేశారని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అర్జీలను స్వీకరించేందుకు ప్రతీ మంగళవారం, శుక్రవారం రాష్ట్ర స్థాయిలో ప్రజావాణి నిర్వహిస్తున్న విషయం తెలిసిందేనన్నారు. అయితే ఈ నెల10న ప్రజాభవన్లో 16వ కేంద్ర ఆర్థిక సంఘంతో ముఖ్యమైన సమావేశం జరుగనున్న నేపథ్యంలో మంగళవారం నిర్వహించాల్సిన ప్రజావాణిని బుధవారానికి మార్చినట్టు ప్రజా పాలన ప్రత్యేక అధికారిణి దివ్య తెలియజేశారని అన్నారు. కావున జిల్లా ప్రజలు ఈ మార్పును గమనించాలని కలెక్టర్ కోరారు. కాగా, జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button